CPM local leader hacked to death in Kerala (telugu news live): కేరళలో మరో రాజకీయ నేత హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీకి చెందిన స్థానిక నేత కోళికోడ్ జిల్లాలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో చంపేశారు. హతుడిని పీవీ సత్యనాథన్గా గుర్తించారు. కొయిలాండిలోని చెరియపురం ఆలయంలో ఓ ఉత్సవానికి ఆయన హాజరైన సమయంలో దుండగులు మాటు వేసి గొడ్డలితో ఆకస్మికంగా దాడి చేశారు.
ఈ దాడిలో బాధితుడి మెడ, వెనుకభాగంపై వేట్లు పడ్డాయి. రక్తమోడుతున్న సత్యనాథన్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన మరణించారు.
Read more:మణిపూర్ వివాదంలో కొత్తకోణం.. హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్న సుప్రీం ధర్మాసనం
హంతకులు పరారు కాగా.. వారు ఎవరన్నదీ గుర్తించాల్సి ఉంది. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొయిలాండి సీపీఎం సెంట్రల్ లోకల్ కమిటీ కార్యదర్శిగా సత్యనాథన్ పనిచేస్తున్నారు. హత్య దరిమిలా సీపీఎం పార్టీ స్థానికంగా బంద్కు పిలుపునిచ్చింది.