CBSE Open Book Exam: ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్స్(OBE) విధానాన్ని ప్రవేశపెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) యోచిస్తోంది. 9 నుంచి 12వ తరగతి పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సీబీఎస్ఈ మీడియా-పీఆర్ డైరెక్టర్ రమాశర్మ ధ్రువీకరించారు.
నిరుడు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందన్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో పైలట్ పరీక్ష నిర్వహిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్ పరీక్షలను ఎంపిక చేసిన స్కూళ్లలో ఓపెన్ పద్ధతిలో నిర్వహిస్తారు. అలాగే 11, 12 తరగతుల బయాలజీ, ఇంగ్లిష్, మేథమెటిక్స్ సబ్జెక్టు్లో పైలట్ పరీక్ష ఉంటుంది.
Read More: వాలినాథ్ ధామ్ ఆలయం ప్రారంభోత్సం.. అమూల్ స్వర్ణోత్సవ వేడుకలు..
అన్ని స్కూళ్లల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించవచ్చా? లేదా? అన్నది ఈ పైలట్ పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు టెక్ట్స్బుక్స్, స్టడీ మెటీరియల్స్, నోట్స్ చూసి జవాబులు రాసేందుకు అనుమతిస్తారు. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞాపకశక్తి కీలకమైతే.. ఓపెన్ బుక్ ఎగ్జామ్లో విశ్లేషణా సామర్థ్యం బయటపడుతుంది. అంటే ప్రస్తుత విధానంతో పోలిస్తే ఓబీఈ అంత తేలిక కాదనే విషయం బోధపడుతుంది.