TDP-Janasena alliance News(Andhra politics news): సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ. జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నో వాటెల్ లో గురువారం కీలక భేటీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించిన అంశం ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చడంపై చర్చించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి ఫిబ్రవరి 28న భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్న తదితర అంశాలపై భేటీలో చర్చించారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్ఛెన్నాయుడు , యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్,పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడులు తంగిరాల సౌమ్యలు పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోమర్, కొటికల పూడి గోవిందరావు, కందుల దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు.
Read More: చలో సెక్రటేరియట్.. షర్మిల అరెస్ట్..
వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై టీడీపీ, జనసేన కూటమి ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం . వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలను ఇరు పార్టీల నేతలు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు ఇరు పార్టీల నాయకులు.