ED Sends to 7th Time Summon to Delhi CM Delhi Arvind Kejriwal on Delhi Liquor Case: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మధ్య కుంభకోణం కేసులో ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు 6సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా సరే ఢిల్లీ సీఎం విచారణకు వెళ్లలేదు.
ఇటీవల ఆరోసారీ ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో ఢిల్లీ సీఎం స్పందించలేదు. ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఈడీ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆప్ నేతలు అంటున్నారు.
Read More: మాజీ గవర్నర్ సత్యపాల్ ఇంటిపై సీబీఐ దాడులు..
మనీలాండరింగ్ కేసులో విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాకపోవడం ఈడీ కోర్టుకు వెళ్లింది. ఈడీ ఫిర్యాదుతో ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉందని ఆ రోజు న్యాయస్థానానికి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరుకావడానికి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత విచారణకు తప్పకుండా వస్తానని తెలిపారు. కేజ్రీవాల్ వినతి న్యాయస్థానం అంగీకరించింది. మార్చి 16కు తదుపరి విచారణ వాయిదా పడింది.
ఏడోసారి ఈడీ ఇచ్చిన నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తారా? విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగానే డుమ్మా కొడతారా? అనేది ఆసక్తిగా మారింది. ఆరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన సమయంలో కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. మరి ఏడోసారి నోటీసులపై ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.