EPAPER

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

Mannam Venkataramana : అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి

NRI TDP Leader Mannam Venkataramana Died : టిడిపి నేత, ఎన్నారై మన్నం వెంకటరమణ (53) గుండెపోటుతో మరణించారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ కు వస్తుండగా.. ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే గ్రీస్ ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా..వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికలలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 53 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.


Read More : చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన ఏపీ కాంగ్రెస్‌.. ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత

ఆ తర్వాత అమెరికాలోని వివిధ జాతీయస్థాయి తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లోనూ ఆయన యాక్టివ్ గా పనిచేసేవారు. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన వారికి న్యూజెర్సీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి.. తన ఉదారతను, గొప్ప మనసును చాటుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


న్యూజెర్సీ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆయన గుండెపోటుకు గురవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు తెలిపారు. వెంకటరమణ మృతితో టిడిపిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పార్టీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×