EPAPER

Akhilesh Yadav: ‘ఆల్ ఈజ్ వెల్’.. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు: అఖిలేష్‌

Akhilesh Yadav: ‘ఆల్ ఈజ్ వెల్’.. కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవు: అఖిలేష్‌

Alliance Between Samajwadi party and Congress: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం అఖిలేష్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సీట్ల పంపకాల చర్చలపై అస్పష్టత తొలగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పొత్తు చెక్కుచెదరలేదని అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు సరైన దారిలోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.


లక్నోలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీట్ల పంపకాల ఒప్పందాన్ని ప్రకటించనున్నాయి. మొత్తం 17 సీట్లు కాంగ్రెస్‌కు అఖిలేష్ ఆఫర్‌గా పేర్కొన్నారు. ఈ ఆఫర్‌ను కాంగ్రెస్ అంగీకరించే వరకు రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవని, త్వరలోనే మీకు తెలుస్తుందని ‘ఆల్ ఈజ్ వెల్…’ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ ‘మేము పోటీ చేయగలిగినన్ని సీట్ల నుండి పోటీ చేస్తుంది’ అని అఖిలేష్ చెప్పారు. యూపీలో 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.


Read More: ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు రైతుల మృతి..!

తాజా అభ్యర్థుల జాబితాలో, బుదౌన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ మామ శివపాల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దింపింది. వారణాసి నుండి సురేంద్ర సింగ్ పటేల్, కైరానా నుంచి ఇక్రా హసన్, బరేలీ నుంచి ప్రవీణ్ సింగ్ అరోన్ ఉన్నారు. ఎస్పీ తన తొలి జాబితాలో బుదౌన్ నుంచి పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ కుమారుడు ధర్మేంద్ర యాదవ్‌ను బరిలోకి దింపింది.

తన తల్లి సోనియా గాంధీ ఇప్పటి వరకు ప్రాతినిధ్య వహించిన నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి తొలిసారి లోక్‌సభ బరిలోకి దిగబోతున్న ప్రియాంక గాంధీ .. యూపీలో సీట్ల షేరింగ్ విషయంలో కీలకంగా వ్యవహారిస్తున్నారు.

రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ప్రియాంక, అఖిలేష్ ఇద్దరూ హాజరవుతారా?
ఫిబ్రవరి 24న మొరాదాబాద్ నుంచి రాహుల్ గాంధీ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు, తాను ఆసుపత్రిలో చేరానని, అందుకే హాజరు కాలేదని ప్రియాంక చెప్పారు. కాంగ్రెస్ సీట్ల పంపకం ఒప్పందం కుదిరిన తర్వాతే యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ కూడా హెచ్చరిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రకు ప్రియాంక, అఖిలేష్‌ ఇద్దరూ హాజరవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×