Singer Charan fire on Tarun Bhaskar: ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన ఏఐ పద్ధతి వాడుతు ఎన్నో వింతలు సృష్టిస్తున్నాము. ఇదే తరహాలో ఏఆర్ రహమాన్ మరణించిన ఇద్దరు సింగర్స్ వాయిస్ను సృష్టించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ సింగర్స్ కుటంబాన్ని సంప్రధించి వారికి పారితోషకం కూడా ఇచ్చారు.
అయితే ‘కీడా కోలా’ చిత్రం కోసం తరుణ్ భాస్కర్ ఈ పని చేసి వివాదలకెక్కడు. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ని ఏఐ పద్ధతిలో ఉపయోగించారు. దీంతో వివాధం ఎంటో అనుకుంటున్నారా.. ఏఐ పద్ధతిలో ఇలా ఎరైన ఉపయోగించుకోవాలి అనుకుంటే ముందుగా వారి కుటుంబసభ్యలను సంప్రదించి అనుమతులు తీసుకోవాలి.
తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా చిత్రం కోసం అనుమతులు లేకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఉపయోగించాడు. దీంతో అతనికి లీగల్ నోటీసులు పంపించాల్సి వచ్చింది. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ తరుణ్ కీడా కోలా చిత్రబృందంపై ఫైర్ అయ్యారు.
Read More: మెగాస్టార్ ‘విశ్వంభర’లో మరో హీరోయిన్.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ..!
తమతో ఎలాంటి అనుమతి లేకుండా తన తండ్రి వాయిస్ను ఎలా వాడుతారు అని మందిపడ్డాడు. తరుణ్ భాస్కర్కు లీగల్ నోటీసులు కూడా పంపాడు. దీంతో తరుణ్ భాస్కర్ క్షమాపణలు చెప్పి రూ. కోటి సష్టపరిహారం చెల్లించాలని ఎస్పీ చరణ్ తరఫు నాయవాది డిమాండ్ చేశరు. రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని తెలిపారు. ఈ వివాధంపై తరణ్ భాస్కర్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.