Mahesh Babu’s Voice in Phone Pe Speakers: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మూవీ ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఫస్ట్ షో నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని పర్వాలేదనిపించుకుంది.
ఇక ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఎస్ఎస్ఎంబీ 29’ వర్కింగ్ టైటిల్తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందబోతుంది. ఇందులో నటీనటుల కోసం రాజమౌళి హాలీవుడ్ నుంచి స్టార్లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మహేశ్ బాబు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఆయన ఓ సంస్థతో భాగస్వామి అయ్యి.. తన వాయిస్ను అందించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దీంతో ఆ సంస్థకు వాయిస్ అందించిన ఏకైక నటుడిగా మహేశ్ బాబు నిలిచారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే మరి ఇంతకీ మహేశ్ బాబు ఏ సంస్థకి తన వాయిస్ అందించారు అనే విషయానికొస్తే..
READ MORE: ‘జై హనుమాన్’లో చిరంజీవి, మహేశ్ బాబు.. దర్శకుడి ప్లాన్ మామూలుగా లేదు..!
ప్రముఖ డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ ‘ఫోన్పే’తో మహేశ్ బాబు భాగస్వామి అయ్యారు. ఇందులో భాగంగానే ఆయన తన వాయిస్ను ఆ సంస్థకు అందించారు. దీంతో ఇకనుంచి ఫోన్పే స్మార్ట్ స్పీకర్లలో చెల్లింపుల వివారాలు మహేశ్ బాబు వాయిస్తో వస్తాయి. కాగా ఆల్రెడీ మహేశ్ వాయితో వినిపిస్తున్న కొన్ని వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇకపోతే గతంలో ఈ డిజిటల్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ ఫోన్పే కోసం బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తర్వాత ఫోన్పేకి వాయిస్ ఇచ్చిన ఏకైక నటుడిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నిలిచారు.