Man tries to hide gold in clothing at Trichy airport: దుస్తుల్లో రహస్యంగా తరలిస్తున్న బంగారాన్ని ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ట్రిచి విమానాశ్రయంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడింది. దుబాయ్ నుంచి ట్రిచికి వస్తున్న ప్రయాణికుడు రూ.42.69 లక్షల విలువ చేసే 683 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పేస్ట్ రూపంలో ఉన్న ఓ పదార్థంలో బంగారాన్ని ఉంచి అక్రమంగా తరలించే ప్రయత్నించే చేశాడు. ఆ ప్రయాణికుడి జీన్స్ ప్యాంట్ నడుము భాగాన్ని అధికారులు కత్తిరించి చూడగా ఆ బంగారం బయటపడింది.
బంగారానికి ఉన్న విలువ దృష్ట్యా అక్రమంగా తరలిస్తున్న కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. 2020లో ఈ కేసులు 36 శాతం పెరగగా.. 2021లో 22 శాతం పెరిగాయి. కేరళలో కస్టమ్స్ అధికారులు అప్రమత్తత కారణంగా స్మగ్లింగ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.