Three teenagers drown in Yamuna in Delhi one missing: టెన్త్ క్లాస్ విద్యార్థులు ముగ్గురు ఢిల్లీలోని బురారీ వద్ద యమునా నదిలో మునిగిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన 15-17 ఏళ్ల వయసున్న స్నేహితులు నలుగురు యమునలో స్నానం చేసేందుకు వెళ్లారు. తమ పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అన్ని దిక్కులా గాలించారు.
యమునా నది తీరంలో వారి దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారితో పాటు అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రెస్క్యూబోట్తో ఓ బృందం నదిలో గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నాలుగో విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు కొనసాగుతోంది. గత జూలై 22న ఇదే ప్రాంతంలో నలుగురు యమునా నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.