EPAPER

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!
AP Speaker Letter To Rebel MLAs

AP Speaker Letter To Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరగా ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్‌ తమ్మినేని రెబల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. అయినా కానీ ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు .


ఈ క్రమంలోనే ఇక విచారణ చేపట్టకుండా.. న్యాయ నిపుణుల సలహాతో వారిపై చర్యలకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలోనే స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అనర్హత పిటిషన్లపై విచారణ పర్వానికి ముగింపు పలికినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయని సమాచారం అందుతోంది.

Read More: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..


విచారణకు హాజరు కావాలని అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని స్పీకర్ లేఖల్లో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక విచారణ ఉండదని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×