Donation to TTD Trust: బెంగళూరుకు చెందినటువంటి యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందజేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు అందజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10.11 లక్షలు అందజేసినట్లు ప్రకటించారు.
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం టీటీడీ చేపట్టిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. ఈ కార్యక్రమంలో భక్తులు నేరుగా పాల్గొన్నారు.
Read More: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..
వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కోగంటి రామానుజాచార్యులు, మారుతి, అనంతగోపాలకృష్ణ అఖండ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉన్నటువంటి 108 శ్లోకాలను మూడు సార్లు పారాయణం చేసి వినిపించారు.