CM Revanth Reddy Met Nitin Gadkari: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉవముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణ లోని 15 స్టేట్ హైవేస్ను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని సిక్స్ లేన్గా విస్తరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగం డెవలప్మెంట్, హైదరాబాద్ కల్వకుర్తి ఫోర్ లేన్, హైదరాబాద్- శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడర్ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగానికి కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
వీటితో పాటు సిర్పూర్- కాగజ్నగర్ జాతీయ రహదారి, భువనగిరి రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వేరే చోటకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, వాటి పెంపు గురించి చర్చించారు.
Read More: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..
ఇక నల్గొండలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని విన్నవించారు.