Attack on Marreddy Srinivas Reddy(Andhra pradesh today news): తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్రెడ్డిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేశారు దుండగులు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఒంగోలులోని రమేశ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
జయరాం సెంటర్లోని జిమ్స్ ఆసుపత్రిలో ఆర్థిక లావాదేవీలపై డాక్టర్ రామచంద్రారెడ్డితో చర్చిస్తుండగా .. ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చర్చల కోసం పిలిచి పథకం ప్రకారం దాడిచేసినట్టు అనుమానిస్తున్నారు. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.