Kota Student Missing Dead Body Found For 9 days : జేఈఈ పరీక్ష కోసం రాజస్థాన్లోని శిక్షణ పొందుతూ అదృశ్యమైన 16 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అదృశ్యమైన 9 రోజుల అనంతరం రచిత్ సోంధియా మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతను ఓ కోచింగ్ సెంటర్లో జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 11న హాస్టల్ గది నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే అతడిని చివరిసారిగా చూడటం. ఆలయ దర్శనానికి వెళ్తున్నట్టు రచిత్ హాస్టల్లో ఉంచి వెళ్లిన ఓ లేఖలో పేర్కొన్నాడు. ఆలయం వద్దే అతని బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులను వదిలివెళ్లడంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.
Read More: జమ్మూ కశ్మీర్లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా..?
ఆ మేరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను గమనించారు. దర్శనం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఆ కెమోరాల్లో నమోదైంది. దాని ప్రకారం.. రాష్ట్రపోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతని మృతదేహంలభ్యమైంది. కోచింగ్ హబ్గాపేరొందిన కోటలో మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నాడు.