EPAPER

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing: కోట విద్యార్థి అదృశ్యం.. 9రోజులకు మృతదేహం లభ్యం..!

Kota Student Missing Dead Body Found For 9 days : జేఈఈ పరీక్ష కోసం రాజస్థాన్‌లోని శిక్షణ పొందుతూ అదృశ్యమైన 16 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అదృశ్యమైన 9 రోజుల అనంతరం రచిత్ సోంధియా మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అతను ఓ కోచింగ్ సెంటర్‌లో జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.


ఈ నేపథ్యంలో ఈ నెల 11న హాస్టల్ గది నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. అదే అతడిని చివరిసారిగా చూడటం. ఆలయ దర్శనానికి వెళ్తున్నట్టు రచిత్ హాస్టల్‌లో ఉంచి వెళ్లిన ఓ లేఖలో పేర్కొన్నాడు. ఆలయం వద్దే అతని బ్యాగ్, మొబైల్ ఫోన్, గది తాళాలు, ఇతర వస్తువులను వదిలివెళ్లడంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి.

Read More: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా..?


ఆ మేరకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను గమనించారు. దర్శనం అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు ఆ కెమోరాల్లో నమోదైంది. దాని ప్రకారం.. రాష్ట్రపోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు అతని మృతదేహంలభ్యమైంది. కోచింగ్ హబ్‌గాపేరొందిన కోటలో మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ ఏడాది కాలంగా శిక్షణ పొందుతున్నాడు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×