Murder in Prakasam District: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. నికరంపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా నరికి చంపారు. వెంకటేశ్వర్లు ఇంట్లో నిద్రిస్తుండగా.. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడిన కాశీరామిరెడ్డి అనే యువకుడు.. గొడలితో దాడి చేశాడు. భర్త వెంకటేశ్వర్లుపై దాడిని చూసి అడ్డు వచ్చిన అతని భార్య తిరుపతమ్మపై కూడా అదే గొడ్డలితో దాడి చేశాడు. ఆమె చేతిని నరికేశాడు. కాశీరామిరెడ్డి దాడిలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతని భార్య తిరుపతమ్మ తీవ్రంగా గాయపడింది.
Read More: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడివున్న తిరుపతమ్మను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు హత్య అనంతరం.. నిందితుడు కాశీరామిరెడ్డి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.