Fire Accident In Karimnagar: తెలంగాణలోని కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల రహదారిలోని సుభాష్నగర్లో ఈ ఘటన జరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ నివసిస్తున్నారు. వారంతా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇక్కడ మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారి మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగిసి పడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి.
పూరిళ్లలోని 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ప్రమాద సమాచారం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
Read More: బ్లడ్ బ్యాంకుల్లో ప్లాస్మా దందా.. హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ సెంటర్లు సీజ్
జగిత్యాల రహదారిలోని సుభాష్ నగర్ లో కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. పూరిళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వారంతా మేడారం జాతరకు తరలివెళ్లారు. ఈ సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పూరిళ్లు మాత్రం కాలిబూడిదయ్యాయి.