Earthquake in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ఉదయం 6 గంటల 36 నిమిషాలకు భూ ప్రకంపనలు రాగా.. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. కిష్త్వార్ లో ఉన్నట్లుండి భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై.. బయటకు పరుగు లంకించారు. కాగా.. భూకంపం కారణంగా ఆస్తినష్టమేమైనా జరిగిందా అన్న వివరాలేవీ తెలియరాలేదు.
సోమవారం రాత్రి కూడా భూకంపం సంభవించింది. లడఖ్ పరిధిలోని కార్గిల్ కు సమీపంలో గత రాత్రి 9 గంటల 35 నిమిషాలను భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. ఈ భూకంపం భూమిలోపల 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
నాలుగు రోజుల క్రితం కూడా జమ్మూ కశ్మీర్ లో చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయి. శ్రీనగర్, గుల్ మార్గ్ ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూకంపం రాగా.. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.