EPAPER

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. ఆస్తి, ప్రాణనష్టం జరిగిందా?

Earthquake in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని ఉదయం 6 గంటల 36 నిమిషాలకు భూ ప్రకంపనలు రాగా.. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ) వెల్లడించింది. కిష్త్వార్ లో ఉన్నట్లుండి భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై.. బయటకు పరుగు లంకించారు. కాగా.. భూకంపం కారణంగా ఆస్తినష్టమేమైనా జరిగిందా అన్న వివరాలేవీ తెలియరాలేదు.


సోమవారం రాత్రి కూడా భూకంపం సంభవించింది. లడఖ్ పరిధిలోని కార్గిల్ కు సమీపంలో గత రాత్రి 9 గంటల 35 నిమిషాలను భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. ఈ భూకంపం భూమిలోపల 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

నాలుగు రోజుల క్రితం కూడా జమ్మూ కశ్మీర్ లో చిన్న చిన్న ప్రకంపనలు వచ్చాయి. శ్రీనగర్, గుల్ మార్గ్ ప్రాంతాల్లో 3.9 తీవ్రతతో భూకంపం రాగా.. భూమిలోపల 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.


Related News

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Big Stories

×