Plasma Business in Blood Banks: బ్లడ్ బ్యాంక్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బ్లడ్ బ్యాంక్ల ద్వారా ప్లాస్మా దందా చేస్తున్నారన్న పక్కా సమాచరంతో ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో ల్యాబొరేటరీస్లో అక్రమంగా నిల్వ చేసిన హ్యూమన్ ప్లాస్మా, హోల్ హ్యూమన్ బ్లడ్, హ్యూమన్ సీరోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మదీనగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ సెంటర్, దారుల్షిఫాలోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ను సీజ్ చేశారు. అలాగే మూసాపేటలోని హేమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలోనూ సోదాలు జరిపారు. ఫ్రీజర్లలో నిల్వ చేసిన బ్లడ్ ప్యాకెట్లు, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధననలకు విరుద్దంగా గత 8 ఏళ్లుగా రాఘవేంద్రరావు ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.
Read More: యూసుఫ్గూడలో యువకుడి వీరంగం.. ట్రాఫిక్ పోలీసుపై దౌర్జన్యం
మదీనాగూడలోని శ్రీకర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, దారుల్షిఫాలోని న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, కర్నూల్లోని ఆర్ఆర్ బ్లడ్ బ్యాంక్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన బ్లడ్ బాటిల్స్ను మూసాపేటలోని భవానీ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నిల్వ చేసి.. వాటిని మళ్లీ ప్యాక్ చేసి విక్రయాలు జరుపుతున్నట్టు నిర్ధారించారు. రాఘవేంద్రనాయక్ ఇతర బ్లడ్ బ్యాంక్ నుంచి 150 ఎంఎల్ హ్యూమన్ ప్లాస్మా బ్యాగ్ను 7 వందల రూపాలయకు కొనుగోలు చేసి.. దానిని తిరిగి ప్యాకింగ్ చేసి ఇతర కంపెనీలకు 3వేలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. 2016 నుంచి 6 వేల యూనిట్ల కంటే ఎక్కువ రక్తాన్ని సేకరించి, విక్రయించినట్టు అధికారులు తెలిపారు.