Road Accident in Prakasam District: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ఆటో ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ఆటోలో మంటలు చెలరేగి మృతుల్లో ఇద్దరు సజీవ దహనమైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం కంభం ఆసుపత్రికి తరలించారు. మృతులను బెస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం