EPAPER

Naseem Shah: విరాట్ కోహ్లీ వినయంగా ఉంటాడు.. పాకిస్థాన్ యువ పేసర్ ప్రశంసలు..

Naseem Shah: విరాట్ కోహ్లీ వినయంగా ఉంటాడు.. పాకిస్థాన్ యువ పేసర్ ప్రశంసలు..
Virat Kohli latest news

Virat Kohli latest news(Sports news headlines): విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నప్పుడు చాలా వినయంతో చాలా సాదాసీదా వ్యక్తిగా ఉంటాడని పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా అన్నాడు. నసీమ్‌ 2022లో మెల్‌బోర్న్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆసియా కప్‌లో T20I మ్యాచ్‌తో పేసర్‌గా అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచే భారత్‌తో ఆడాడు. నసీమ్‌ తన అరంగేట్రంలోనే బాగా బౌలింగ్‌ చేసి కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను అవుట్ చేశాడు. తన స్పెల్ లో (4-0-27-2) మెరుగ్గానే బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.


Read More: టర్నింగ్ పిచ్ లు అంటే నేను ఒప్పుకోను: రోహిత్ శర్మ

విరాట్‌ కోహ్లీ చాలా పెద్ద స్టార్‌ అయినప్పటికి మైదానంలో ఉన్నప్పుడు ఎలాంటి వైఖరి చూపించకుండా.. చాలా వినయపూర్వకంగా, సాధారణ వ్యక్తిగా ఉంటాడని నషీమ్ షా అన్నాడు. అతను ఆటపై చాలా ప్యాషీనేట్‌గా ఉంటాడన్నాడు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి అని నసీమ్‌ షా ఓ టీవీ చానల్‌లో తెలిపారు. నసీమ్‌ షా ఆసియా కప్‌ 2023 నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఓడిన తర్వాత ఆ బాధ నుంచి ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నామన్నాడు.


ప్రస్తుతం ఇంగ్లాండ్ తో భారత్ టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌పై దృష్టి సారిస్తుంది. ఈ మ్యాచ్‌ ఇంగ్లాండ్‌కు డూ-ఆర్-డై మ్యాచ్. మరోవైపు ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఆతిథ్య భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×