Bus Accident Near Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ (TSRTC)బస్సు కత్తిపూడి వద్దజాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్కు బీపీ లెవెల్స్ తగ్గడం ఈ ఘటన చోటుచేసుంది.
డ్రైవర్కు బీపీ డౌన్ కావడంతో ఆయన బస్సు స్టీరింగ్పై నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారు అందరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అన్నవరం ఎస్సై కిశోర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.