EPAPER

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!

నగరంలో కలకలం.. ప్రాణం తీసిన పంటి వైద్యం!

Man Allegedly Dies Due to Teeth Procedure: జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.37లో ఎఫ్‌ఎంఎస్‌ ఇంటర్నేషనల్‌ డెంటల్‌ క్లినిక్‌ (FMS International Dental Clinic)లో 28 ఏళ్ల వ్యక్తి దంత చికిత్స పొందుతూ మృతి చెందాడు.


బాధితుడిని లక్ష్మీనారాయణ వింజం గా గుర్తించారు. దంత వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడమే ఆయన అకాల మరణానికి కారణమైందని ఆరోపించారు.

లక్ష్మి నారాయణ అనే వ్యాపారవేత్త స్మైల్-డిజైనింగ్ (Smile-Designing) అనే ప్రక్రియ కోసం ఈ క్లినిక్‌ని సంప్రదించాడు. చికిత్స సమయంలో అతనికి అనస్థీషియా ఇవ్వబడింది. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. బాధితుడిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితుడిని పరిశీలించగా.. మరణించినట్లు తెలిపారు.


Read More: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు..

తన కుమారుడి మృతికి దంతవైద్యుడే కారణమంటూ బాధితుడి తండ్రి వింజం రాములు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇవ్వడంలో దంతవైద్యుడి నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఫిర్యాదులో తెలిపాడు. సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవాలని రాములు పోలీసులను కోరారు.

పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ICC)లోని సెక్షన్ 304 (A) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×