Man brutally murdered: నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. నవాబుపేట రామచంద్రాపురంలో.. ఆటో డ్రైవర్ అయిన ప్రసాద్ను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అర్థరాత్రి ఇంట్లోకి దూరిన దుండగులు ప్రసాద్ పై కత్తులతో దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన భార్య నోటిలో గుడ్డలు కుక్కి.. ఆమె కళ్లెదుటే ప్రసాద్ ను చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు తెలుస్తోంది.
Read More: మిన్నెసోటాలో పోలీసులతో సహా ముగ్గురి కాల్చివేత
సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రసార్ శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రసాద్ గొంతు, కాళ్ల భాగాలను కట్ చేసిన గుర్తులు ఉన్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలను సేకరించాయి. కాగా.. పాత కక్షలు, స్థానికంగా కొందరితో ఉన్న విబేధాల వల్లే ప్రసాద్ ను హతమార్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.