500 cows died in Madhya Pradesh : మధ్యప్రదేశ్లో వందల సంఖ్యలో గోవులు చనిపోయాయి. సిల్లెర్పూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆవుల కళేబరాలు కనిపించడం కలకలం సృష్టించింది. దాదాపు 400- 500 వరకు కళేబరాలు ఉండొచ్చని గ్రామపెద్ద తెలిపారు. ఆ ప్రాంతానికి గోవులు ఎలా వచ్చాయో, అవి చనిపోవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.
అయితే చనిపోయిన ఆవులను పట్టణాల నుంచి తీసుకొచ్చి రాత్రికి రాత్రే అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కరారియా మునిసిపాలిటీ నుంచి చనిపోయిన ఆవులను తెచ్చి పడేసేందుకు ఆ ప్రాంతం పెద్ద డంపింగ్ యార్డ్లాగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Read more: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కీలక ప్రతిపాదన
అతి శీతల పరిస్థితుల వల్ల కూడా గోవులు మరణించే అవకాశాలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏది ఏమైనా తమ సమీప ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆవు కళేబరాలు పడి ఉండటంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.