Geetha Madhuri: సింగర్ గీతా మాధురి తన స్వరంతో ఆడియన్స్ను ఉర్రూతలుగిస్తుంది. మాస్, రొమాంటిక్ సాంగ్స్ పాడటంతో ఆమె స్పెషలిస్ట్. ఎలాంటి లిరిక్స్నైనా అలవోకగా పాడేస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఎక్కువగా పాటలు పాడటం లేదు. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
అయితే గీతా మాధురి ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవలే వారు 800 మందికి అన్నదానం చేశారు. ఇక ఆమె సీమంత వేడుకలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా గీతా మాధురి తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది.
ఇందులో భాగంగా తమకు ఫిబ్రవరి 10న మగబిడ్డ జన్మించాడంటూ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి 10న బిడ్డ పుడితే.. 17వ తేదీనా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఈ విషయం తెలిసి సెలబ్రెటీలు, అభిమానులు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గీతా మాధురి, నందులు మొదటి సారిగా 2019లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమె పేరు ప్రకృతి. మరి ఈ పిల్లాడికి ఏ పేరు నామకరణం చేస్తారో చూడాలి.