Union Minister congratulated ISRO scientists: ఇస్రో చేపట్టిన ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగ కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోది ప్రోత్సాహంతోనే ఇస్రో వరుస విజయాలు సాధిస్తోంది అన్నారు. భారత శాస్ర్తవేత్తలు ప్రతిభ, సామర్థ్యం పనిచేస్తున్నారని కొనియాడారు.
Read More: ఇన్సాట్-3 డీఎస్ ఉపగ్రహం ప్రయోగం సక్సెస్.. ఇంతకీ ఆ ప్రయోగంలో ఏముంది?
గత ప్రభుత్వం వారికి అనుకూలంగ లేకపోవడంతో పురోగతి సాధించలేకపోయింది అన్నారు. ప్రైవేట్ మార్గాలతో పెరుగుతున్న పెట్టుబడులే కాక అమెరిక, రష్యా వంటి దేశాలకు ఉపగ్రహాలను అందించడంతో ఆదాయం పెరుగుతుందన్నారు. 2019లో కేవలం ఒక స్పేస్ స్టార్టప్ నుంచి ఇప్పుడు 190 కంపెనీలకు పెరిగాయని పేర్కొన్నారు. దాదాపు రూ. 1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఇస్రో పొందుతుందని తెలిపారు. ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి రూ. 4,000 కోట్లకు పైగా ఇస్రో సంపాదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
2025లో అంతరిక్షంలోకి పంపేందుకు రోబోలు సిద్ధంగా ఉన్నాట్లు తెలిపారు. 2047లో ప్రతిష్టాత్మకమైన ‘డీప్ సీ మిషన్’ను హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల చేపట్లే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.