Fire Accident In Crackers Factory : తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. విరుధ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. పేలుడు తీవ్రత భారీగా ఉందని స్థానికులు తెలిపారు. ఫలితంగా మరో నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి.
Read more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..
ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారని పోలీసులు చెప్పారు. వెంబకొట్టాయ్ ఏరియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిరుడు క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయారు.
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలో ఉన్న వెంబకొట్టాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్నారు. కెమికల్ మిక్సింగ్ రూములో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని శివకాశి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.