EPAPER

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..
Fire Accident In Crackers Factory

Fire Accident In Crackers Factory : తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. విరుధ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. పేలుడు తీవ్రత భారీగా ఉందని స్థానికులు తెలిపారు. ఫలితంగా మరో నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి.


Read more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..

ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారని పోలీసులు చెప్పారు. వెంబకొట్టాయ్ ఏరియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిరుడు క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయారు.


తమిళనాడులోని విరుద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్నారు. కెమికల్‌ మిక్సింగ్‌ రూములో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని శివకాశి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×