TS Assembly Budget Sessions : తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులపై నేడు అసెంబ్లీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయగా.. దానిపై వాడి-వేడిగా చర్చ జరుగుతోంది. విపక్షాన్ని టార్గెట్ చేసిన మంత్రులు.. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అవినీతి కారణంగానే మేడిగడ్డ కుంగిందని, ఇప్పుడు అన్నారం కూడా అది స్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చ పెడితే.. కాంగ్రెస్ కు సెల్ఫ్ గోల్ అవుతుందన్నారు.
Read More : మేడిగడ్డపై విపక్షాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం.. హరీష్ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్లు
రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయం జరిగిన తప్పులను ఇప్పటికైనా ఒప్పుకుని హరీష్ రావు క్షణాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పని చెప్పి.. తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ దేవుడు చెప్పాడో గానీ.. కేసీఆర్ మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టును కట్టాలని చెప్పారని, ఇంజనీర్ల కమిటీ తమ్మడిహట్టి వద్దే ప్రాజెక్టు నిర్మించాలని చెప్పిందన్నారు.కేసీఆర్ – హరీష్ కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే.. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నెమలికే నాట్యం నేర్పినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.