Kiara Advani latest news (entertainment news today):
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే తాను ప్రేమించిన బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్ళించేసుకుంది. కాగా దాదాపు ఐదారేళ్ల పాటు సీక్రెట్గా లవ్ చేసుకున్న ఈ జంట ఎప్పుడూ తమ ప్రేమను అఫీషియల్గా ప్రకటించలేదు.
వీరి రిలేషన్పై ఎంతో మంది నెటిజన్లు, అభిమానులు అడిగినా.. ఏదో ఒక ఆన్సర్ చెప్పి జారుకునే వారు. అంతేకాకుండా ఇంటర్వ్యూలలో సైతం వీరిద్దరి రిలేషన్పై అడిగినా.. అదే లేదు అని చెప్పేవారు. అలాగే వీరిపై వచ్చిన ట్రోల్స్ను సైతం పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ సడెన్గా కియారా, సిద్ధార్థ్ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు.
ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ జంట రాజస్తాన్లోని ప్యాలస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి అతి కొద్దిమంది ప్రముఖుల సమక్షంలోనే జరిగింది.
READ MORE: RC 15.. కియారా అద్వానీ షాకింగ్ రెమ్యునరేషన్
అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొందరు సెలబ్రెటీలు సినిమాలకు, అందాల షోలకు దూరంగా ఉంటారు. కానీ కియారా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పెళ్లయిన తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. అంతేకాకుండా తన అందాలు ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన సినిమాలు, వ్యక్తి గత విషయాలకు సంబంధించిన అంశాలను షేర్ చేస్తుంది. అయితే ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తల్లి కాబోతుందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫొటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన భర్త సిద్ధార్థ్తో కలిసి దిగిన ఫొటోలు బయటకు రాగా.. అందులో కియారా పొట్ట కాస్త ఎక్కువగా ఉంది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే దీనిపై కియారా ఇంకా స్పందించలేదు. కానీ ఈ వార్తతో కియారా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
READ MORE: రామ్ చరణ్ అంత పెద్ద స్టార్ కావటానికి అదే కారణం: కియారా అద్వానీ
ఇకపోతే కియారా ప్రస్తుతం టాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.