X Banned Over 2 Lakh Indian Accounts : సోషల్ మీడియా వాడకంతో పాటే దానిని దుర్వినియోగం చేసే వారి సంఖ్యా పెరిగిపోయింది. నిబంధనలను ఉల్లంఘించే యూజర్ల పట్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘ఎక్స్’ సంస్థ నిత్యం కన్నేసి ఉంచుతుంది.
దేశంలో అలా గీత దాటిన 2 లక్షలకుపైగా ఖాతాలను ఆ సంస్థ తొలగించింది. డిసెంబర్ 26-జనవరి 25 మధ్య మొత్తం 2,3,1215 ఖాతాలను నిషేధించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అనుమతి లేకుండా ఒకరి అసభ్యకర చిత్రాలను ట్యాగ్ చేయడం, షేర్ చేయడం వంటి ఆరోపణలపై తొలగించినవే వీటిలో అధికంగా ఉన్నాయి.
Read More: టెక్ట్స్ నుంచి నేరుగా వీడియో!
టెర్రరిజానికి ఊతమిస్తున్న మరో 1945 అకౌంట్లను కూడా ఈ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫాం నిలిపివేసింది. మొత్తం మీద నెల రోజుల వ్యవధిలో 2,33,160 ఖాతాలపై ‘ఎక్స్’ వేటు వేసింది. 2021లో అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. భారత యూజర్ల నుంచి తమకు 2,525 ఫిర్యాదులు ఎక్స్కు అందాయని ‘ఎక్స్’ సంస్థ తెలిపింది.