BRS Party alliance with BJP(TS Politics): బీజేపీతో తమకు పొత్తు ఉంటుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ను భద్రారెడ్డికి కేటాయించారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరు బీజేపీతో టచ్లో లేరు అలాగే పార్టీ మారే పరిస్థితి కూడా లేదని మల్లారెడ్డి తెలిపారు.
Read More: బీఆర్ఎస్కు అల్లు అర్జున్ మామ షాక్.. కాంగ్రెస్లో చేరిన పట్నం, బొంతు..
ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మందితో పాటు సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. కాని ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోము అని స్పష్టం చేశారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని పేర్కొన్నారు.
బీజేపీ ఎప్పుడు అవినీతి రాజకీయాలు చేసే పార్టీలతో పొత్తుకు పోదు అని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తు లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో బీఆర్ఎస్కు చోటు లేదు మరి ఇప్పుడు అధికారం కోల్పొయిన ఆ పార్టీతో ఎందుకు పొత్తుకు పోతాము అని అన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలే పక్క పార్టీల వైపు చూస్తునరని బండి సంజయ్ పేర్కొన్నారు.