Liquor Price Hike (today’s latest news) :
కర్ణాటక ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారత్ లో తయారైన మద్యం అమ్మకాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అందుకే మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటకలో మద్యం ధరలు మరింత పెరగనున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం విధాన సౌధలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సమర్పించారు. తన బడ్జెట్ ప్రసంగంలో కీలక నిర్ణయాలను వెల్లడించారు.
రాష్ట్ర ఖజానాకు ముఖ్య ఆదాయ వనరు భారతీయ తయారీ మద్యం అమ్మకాలను సీఎం సిద్ధరామయ్య వివరించారు. అందుకే ప్రభుత్వ ఖజానా ఆదాయం పెంచేందుకు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నామని ప్రకటించారు. గత ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై సుంకాలను పెంచడం ఇది రెండోసారి.
Read More: దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు..
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ప్రభావం బీర్లపై భారీగా పడుతుంది. అందుకే బీర్ల ధరలు పెరుగుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.