DOP Senthil Kumar: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. అతని భార్య రూహీ ఆరోగ్య సంబంధిత సమస్యలతో గురువారం (ఫిబ్రవరి 15) కన్నుమూశారు. రూహీ గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు.
సెంథిల్ కుమార్ తన భార్యను చూసుకోవడానికి పని నుంచి విరామం తీసుకున్నాడు. కాగా ఆమె గురువారం కన్నుమూయడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు రూహీకి నివాళుల అర్పించారు.
Read More: సినిమా స్టార్ల క్రికెట్ టోర్నీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు రూహి అంత్యక్రియలు జరుగుతాయని నివేదికలు పేర్కొన్నాయి.
రూహీ యోగా శిక్షకురాలు. నటి అనుష్క శెట్టితో కలిసి పనిచేసినట్లు తెలుస్తోంది. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె హెడ్గా వ్వవహించారు.
సెంథిల్ కుమార్, రూహీ జూన్ 2009లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే రూహి తరచూ తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసుకునేది.
కాగా సెంథిల్ కుమార్ చిత్రనిర్మాత ఎస్ఎస్ రాజమౌళితో తరచుగా కలిసి పని చేయడంతో ప్రసిద్ది చెందారు. అతను సై, చత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్, RRR వంటి ప్రముఖ చిత్రాలకు పనిచేశాడు.