Unidentified persons Murderd married woman: గుంటూరు జిల్లాలో వివాహితను దారుణంగ హత్య చేశారు. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలోని స్థానిక భవనం వారి వీధిలో నివాసముంటున్న రామిశెట్టి అలేఖ్య(35)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
గొంతు కోసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. గురువారం ఉదయం తన గదిలో రక్తపు మడుగులో పడిఉన్న అలేఖ్యను ఆమె భర్త రమేశ్ గుర్తించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు ఘటనా స్థలనికి చేరుకుని వివరాలు సేకరించారు.
Read More: ‘రాజధాని ఫైల్స్’ సినిమాపై హైకోర్టు బ్రేకులు.. అర్ధంతరంగా నిలిపివేసిన అధికారులు
మృతరాలి భర్త రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్నేళ్లుగా ఆయన భార్యను శ్రీనివాస్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని తెలిపారు. అతనిపై కేసు కూడా పెట్టామని చెప్పుడు. ఆమెపై హత్యాయత్నం చేశాడని.. కుటుంబాన్ని చంపుతామని పలుమార్లు బెదిరించాడని తెలిపారు. అతడిపై పెట్టిన కేసులో శిక్ష పడే అవకాశం ఉండటంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని రమేశ్ పోలీసులకు వివరించాడు.
సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున పదునైన ఆయుధంతో గొంతు కోయడంతోనే తీవ్ర గాయమై అలేఖ్య చనిపోయినట్లు తెలిపారు. హత్య జరిగిన విధానం చూస్తే తెలిసిన వ్యక్తులే ఇలా చేసినట్లు తెలుస్తోందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.