CAG Report On Aasra Pensions(TS today news): ఆసరా పింఛన్ల పంపిణీపై కంప్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (CAG) అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఆసరా పింఛన్లను పంపిణీ చేయడంలో గోల్ మాల్ జరిగిందని తన నివేదికలో వెల్లడించింది.
2018-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆడిట్ చేసిన కాగ్ ఈ నివేదికను వెల్లడించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని కాగ్ నివేదికలో పేర్కొంది. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని వెల్లడించింది.
వినియోగించని మొత్తం బ్యాంకు ఖాతా ఉంది.. సెర్ప్ మాత్రం పూర్తిగా చెల్లించినట్లు కాగ్ నివేదిక ఇచ్చారు . 2018-21 మధ్య కాలంలో సగటున నెలకు 2.3లక్షల మందికి పింఛన్ల చెల్లింపు జరగలేదని తెలియజేసింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా పింఛన్లు జారీ చేసినట్లు కాగ్ వెల్లడించింది.