India Vs England 3rd test India’s Debutants: రాజ్ కోట్ టెస్టులో టీమిండింయా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు ఆరంగేట్రం చేశారు. కీపర్ ధ్రువ్ జురెల్, బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చారు. తుది జట్టులోకి రవీంద్ర జడేజా తిరిగి వచ్చాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ కు జట్టులో చోటు దక్కింది.
జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు దక్కింది. రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ కు జట్టులో స్థానం కల్పించారు. భారత్ ఇద్దరు పేసర్లు జస్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ లతో బరిలోకి దిగింది. యువ బ్యాటర్ రజత్ పటీదార్ కు మరో ఛాన్స్ దక్కింది.
ఇంగ్లాండ్ రెండో టెస్టు ఆడిన జట్టులో ఒక మార్పు చేసింది. విశాఖపట్నం టెస్టులో ఆరంగేట్రం చేసిన సోయబ్ బషీర్ స్థానంలో పేసర్ మార్క్ వుడ్ కు స్థానం కల్పించింది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ తో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగింది.
Read More: మూడో టెస్టు.. ఆ నలుగురు రికార్డులు బ్రేక్ చేస్తారా?
మార్క్ వుడ్ భారత్ ను ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను (10) పెవిలియన్ కు చేర్చాడు. దీంతో భారత్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత శుభ్ మన్ గిల్ కూడా వుడ్ బౌలింగ్ ను డకౌట్ అయ్యాడు. రెండు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు పడటంతో భారత్ కష్టాల్లో పడింది.
లంచ్ విరామ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. అప్పటికీ 25 ఓవర్లు పూర్తయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ (52 బ్యాటింగ్) కొట్టాడు. రవీంద్ర జడేజా (24 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నారు.