Vijay Kumar Launched Liberation Congress Party(AP political news): ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రాజకీయ అడుగులు వేశారు. ‘లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ’ పేరుతో కొత్త పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అధికజన మహాసంకల్ప సభలో పార్టీ పేరును విజయ్ కుమార్ ప్రకటించారు.
పార్టీ ఏర్పాటు చేసిన వేదికపై విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ ను నేరుగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి పేదల కోసం యుద్ధం చేస్తా మంటున్న మాటలను ప్రస్తావించారు. పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకు ఇచ్చి సీఎం జగన్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు.
Read More: సీమలో నిర్ణయాత్మకంగా ఉన్న బలిజ ఓటర్లు.. జగన్ కి ఆ ఓట్లు వద్దా..?
దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చారని విజయ్ కుమార్ విమర్శించారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలని కోరారు. హాస్పటల్ కువెళ్లలేక గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఎక్కువగా మహిళలే ఉంటున్నారని తెలిపారు.