Delhi Liquor Case Updates: మద్యం కుంభకోణం కేసులో మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆరోసారి నోటీసులు పంపింది. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్ కు ఐదు సార్లు సమన్లు పంపింది. వివిధ కారణాలతో విచారణకు హాజరుకాని ఆప్ అధినేత విచారణ హాజరుకాలేదు.
తాజాగా ఇచ్చిన నోటీసుల్లో ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది.