appsc-group2 Exam updates(Andhra news today): ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. తాజాగా అభ్యర్థుల హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటించారు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఎగ్జామ్ రోజు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలని స్పష్టం చేశారు.
897 గ్రూప్-2 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు పరీక్ష మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది.
జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ లతో ఈ ఎగ్జామ్ ఉంటుంది.