Congo Boat Capsize (daily news update):
కాంగోలో పడవ మునక.. 37మంది మృతి! తూర్పు కాంగోలోని కివు నదిలో ఓ బోటు మునిగిపోయింది. ఆ చెక్కపడవలో ప్రయాణిస్తున్న 50 మందిలో అత్యధికులు ఈ దుర్ఘటనలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
కివు నదిని దాటుతున్న ఆ పడవలో ప్రయాణికులతో పాటు 20 బస్తాల సిమెంట్ ఉన్నట్టు చెబుతున్నారు. అధిక బరువే పడవ మునకకు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు.
Read more: 9 మంది కార్మికులను మింగిన సైనేడ్ గుట్ట?
మొత్తం పది మంది ప్రాణాలను రక్షించుకోగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 37 మంది కోసం ముమ్మర గాలింపు సాగుతోంది. కాంగోలో పడవ మునక ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటుంటాయి.
గత నెలలో మైడాంబే నదిలో బోటు మునిగిపోవడంతో 22 మంది చనిపోయారు. నిరుడు ఏప్రిల్లో కివు నదిలో ఆరుగురు మృతి చెందగా.. 64 మంది ఆచూకీ తెలియలేదు. నిబంధనలను తోసిరాజని.. ఓవర్లోడింగ్ చేయడమే పడవ ప్రమాదాలకు ప్రధాన కారణం.