EPAPER

Road Accident : ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి

Road Accident : ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి
Road Accident Hyderabad

Excise CI dead in Road Accident(Hyderabad news today): హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి కోర్టు సమీపంలో ఓ కారు రాంగ్ రూట్‌లో యూటర్న్ తీసుకుంటుండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ సాదిక్ అలీగా, గాయలైన వ్యక్తి నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్.ఐ కాజావలి మోహినుద్దీన్ గా పోలీసులు గుర్తించారు.


సీఐ సాధిక్ అలీ, ఎస్.ఐ కాజా వల్లి మోహినుదిన్ మలక్ పేట్ లోని ప్రభుత్వ క్వార్టర్స్‌ లో ఉంటున్నారు. ఎల్బీనగర్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి మలక్ పేట్ లోని క్వార్టర్స్ కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ కారును వదిలేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. సీఐ సాధిక్ అలీకి 2 రోజుల క్రితమే మెదక్ కు ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలుస్తోంది.


Tags

Related News

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×