Vyooham And Shapadham Trailers: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంఘటనలను ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొని సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ ‘వ్యూహం’ కాగా రెండవ పార్ట్ను ‘శపథం’ పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే దర్శకుడు తెలిపాడు. అయితే తాజాగా ఈ రెండు మూవీల ట్రైలర్లను దర్శకుడు రిలీజ్ చేసి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.