Hyderabad as a Joint Capital for Andhra and Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాజధాని నిర్మించే ఆర్ధిక స్థోమత ఏపీకి లేదన్న ఆయన.. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు.
విశాఖ రాజధాని అయ్యే వరకూ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. దానికోసం పెద్దసభలోనూ మాట్లాడతామని వైవీ అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైవీ అన్న మాటలు.. ఆయన వ్యక్తిగతమన్న మంత్రి.. ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నారు.