Ravi Teja’s Eagle Second Day Collections: మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. సంక్రాంతి పోరులో పలు సినిమాలు రిలీజ్ కానుండటంతో థియేటర్లు కరువై పోస్ట్ పోన్ చేసుకుంది. ఇక ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మిక్సిడ్ టాక్ అందుకుంది.
ఈ మూవీలో యాక్షన్ సీన్స్ హైలెట్గా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఈ మూవీపై ఎక్కువగా కేజీఎఫ్ ప్రభావం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఫస్ట్ హాప్ అంతా ఎలివేషన్స్ కోసమే అయిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఈ మూవీకి తగ్గ పోటీ లేకపోవడంతో సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్లపై తాజాగా చర్చ సాగుతోంది. ఈ మూవీకి దాదాపుగా రూ.22 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ బిజినెస్కు తగ్గట్టుగానే మేకర్స్ ఈ మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో కలిపి మొత్తంగా 700 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. ఓవర్సీస్లో మొత్తం 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.
READ MORE: Eagle First Day Collections : ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అదిరిపోయిన మాస్ ఓపెనింగ్స్
ఇదంతా ఒకెత్తయితే.. ఈ మూవీకి వచ్చిన రెండు రోజుల కలెక్షన్స్ మొత్తం ఎంతో తెలుసుకుందాం.
మొదటి రోజు చూసుకుంటే.. ఈ సినిమా ఓవర్సీస్లో అమెరికా, కెనడాలో దాదాపు 65కె, యూకే, ఐర్లాండ్లో 23కె, ఆస్ట్రేలియాలో 8కె, యూఏఈ,గల్ఫ్ దేశాల్లో 250 డాలర్లు వసూళు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇండియాలో చూసుకుంటే.. ఏపీ, నైజాంలో 4 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి కలెక్ట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా మొత్తం రూ.6కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండో రోజుకు వచ్చేసరికి ఈ సినిమా వసూళ్లు కాస్త డ్రాప్ అయినట్లు సమాచారం. రెండో రోజు కేవలం రూ.4.75 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా రెండు రోజులకి కలిపి రూ.10 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
READ MORE: Eagle Movie Review & Rating: ఈగల్ రివ్యూ.. మాస్ మహారాజా డిజాస్టర్ రికార్డుల నుంచి తేరుకున్నాడా..?
ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ప్రకారం.. ఈ మూవీని హిట్టుగా పరిగణించాలంటే మొత్తం రూ.23 కోట్లు రాబట్టాలి. ప్రస్తుతం వచ్చిన కలెక్షన్స్ ప్రకారం.. ఈ సినిమా మరో రూ.12 కోట్లు సాధించాల్సి ఉంటుంది. చూడాలి మరి ఈ మూవీ మరికొన్ని రోజుల్లో ఎంతమేరకు కలెక్ట్ చేస్తుందో.
కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దావ్జాండ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు కీలక పాత్రలో కనిపించారు.