Bangladesh Woman Prostitution in Hyderabad: డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్కు చెందిన ఓ యువతి అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్లోకి అడుగుపెట్టింది. కోల్కతా నుంచి సికింద్రాబాద్కు రైల్లో వచ్చింది. అక్కడి నుంచి తనకు జాబ్ ఆఫర్ ఇచ్చిన పాతబస్తీ చాంద్రాయణగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యువతితో వ్యభిచారం చేయిస్తూ దంపతులు డబ్బు సంపాదించసాగారు.
ఫిబ్రవరి 9న బంగ్లా యువతి దంపతులకు చెప్పాపెట్టకుండా అత్తాపూర్లోని ఓ కస్టమర్ వద్దకు వెళ్లింది. దంపతులు ఆమెను వెంబడించగా.. వారి మధ్య గొడవ జరగింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు నిజలు బయటపడ్డయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్కాలనీలో షేక్ సోనియా(27), మహ్మద్ సల్మాన్(24) దంపతులు నివసిస్తున్నారు. బట్టల దుకాణంలో పనిచేసే మహ్మద్ సల్మాన్, షేక్ సోనియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. షేక్ సోనియా బంగ్లాదేశ్కు చెందిన మహిళ, భారత్కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. బంగ్లాదేశ్ భారతీయులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ప్రత్యేక యాప్ ఉంది.
ఈ యాప్లో షేక్ సోనియాలో చాటింగ్ చేస్తుండగా.. బంగ్లాదేశ్ వొర్సిండి మండలం రాయ్పూర్ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్(22)తో పరిచయం ఎర్పడింది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్ అడగ్గా.. ఇళ్లలో పనిచేసే ఉద్యోగమైతే నెలకు రూ.10 వేలు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి వస్తే నెలకు రూ.20 వేలు వస్తాయని షేక్ సోనియా సూచించింది. డబ్బు సంపాదించడనికి తాను ఏపనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్ వెల్లడించింది.
భారత్లోకి ఎలా ప్రవేశించాలని స్రిస్టీ అడగ్గా.. ఆ రిస్కు నీవే తీసుకోవాలి.. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్ చేయాలని సోనియా నంబరు ఇచ్చింది. రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్ బంగ్లాదేశ్ సరిహద్దులు అక్రమ మార్గంలో దాటి కోల్కతాకు చేరింది. అక్కడి నుంచి రైలెక్కి నేరుగా సికింద్రాబాద్కు వచ్చి షేక్ సోనియాకు ఫోన్ చేసింది. దంపతలిద్దరు వెళ్లి యువతిని చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు.
షేక్ సోనియా స్వయంగా వెంటవెళ్లి స్రిస్టీ అక్తర్ను తిరిగి తీసుకొచ్చేది. సోనియా ఫోన్ ఆ సమయంలో స్రిస్టీ అక్తర్ వద్ద ఉండేది. ఫిబ్రవరి 9న షేక్ సోనియా పక్కింట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న ఆమెకు ఫోన్ కాల్ రాగా స్రిస్టీ అక్తర్ మాట్లాడింది. అత్తాపూర్లోని పిల్లర్ నంబరు 150 వద్దకు రావాలని సదరు వ్యక్తి చెప్పడంతో దంపతులకు చెప్పకుండా ఆమె ఆటో ఎక్కి అక్కడికి వెళ్లింది. ఇంటికి వచ్చిన షేక్ సోనియా తన ఫోన్ అక్కడే పడి ఉండడం, స్రిస్టీ అక్తర్ కనిపించకపోవడంతో అనుమానపడింది.
ఆఖరులో వచ్చిన నంబరుకు కాల్చేయగా.. అత్తాపూర్కు వస్తోందని తెలిసింది. వెంటనే దంపతులిద్దరు వెంబడించగా అత్తాపూర్లో స్రిస్టీ అక్తర్ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలోని ఫోన్ లాక్కొని స్రిస్టీ 100 డయిల్ చేయగా అత్తాపూర్ ఏఎస్సై మహ్మద్ బుర్హానుద్దీన్, మహిళా సిబ్బందితో అక్కడికి వెళ్లారు. అసలు విషయం తెలుసుకొని ముగ్గురుని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.
ఈ మేరకు పోలీసులు దంపతులతో పాటు బంగ్లాదేశ్ యువతిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్రిస్టీ అక్తర్కు బంగ్లాదేశ్లో భర్త ఆసిఫ్ఖాన్, ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీస్ విచరణలో వెల్లడైంది. ఆసిఫ్ఖాన్ మేస్త్రీ పనిచేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరిందని పోలీసులు తెలిపారు.