Interesting comments by Amit Shah(Political news telugu): పొత్తులపై ఎకనమిక్ టైమ్స్ సమ్మిట్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా స్పందించారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని అమిత్ షా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబపరంగా బావుంటుందన్నారు.
రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదని అమిత్ షా తెలిపారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొందరు బయటకు వెళ్లి ఉండొచ్చని తెలిపారు.తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని అమిత్ షా అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బయటకు వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు. ఇటీవలే టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.
Read More: Haldwani Violence Update: నివురుగప్పిన నిప్పులా హల్ద్వానీ.. హింస ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ..
ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లి ఏకాంతంగా భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల పంపకాలపై నిశితంగా చర్చించినట్టు సమాచారం. హైదరాబాద్ రాగానే జనసేన అధినేత పవన్తో సీట్ల కేటాయింపులపై బాబు చర్చించినట్టు తెలిసింది. నిన్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి విందు ఇవ్వడంతో పాటు ఇవాళ పొత్తులపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.