EPAPER

Haldwani Violence Update: నివురుగప్పిన నిప్పులా హల్ద్వానీ.. హింస ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ..

Haldwani Violence Update: నివురుగప్పిన నిప్పులా హల్ద్వానీ.. హింస ప్రభావిత ప్రాంతాల్లో కర్ఫ్యూ..

Madrasa Demolition Haldwani Violence Update: హింసతో అట్టుడికిన ఉత్తరాఖండ్ లో హల్ద్వానీ నివురుగప్పిన నిప్పులా ఉంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉంది. బంభుల్‌పురాలో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. ఫిబ్రవరి 8 సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని మదర్సా, మసీదును కూల్చివేసేందుకు వచ్చిన సామాన్య ప్రజలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత కర్ఫ్యూ విధించారు. తాజాగా హల్ద్వానీలో కర్ఫ్యూను సవరించారు. హింస ప్రభావం ఉన్న బంభులన్‌పురా ప్రాంతం, ఆర్మీ కాంట్ , బైపాస్‌లలో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో కర్ఫ్యూ లేదు.


కర్ఫ్యూ ఆంక్షలు..
అత్యవసర పని (వైద్యం ) మినహా ఎవరూ ఇల్లు వదిలి వెళ్లకూడదు. అన్ని వ్యాపార సంస్థలు,దుకాణాలు,పరిశ్రమలు పూర్తిగా మూసివేత ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలి. చాలా ముఖ్యమైన పని విషయంలో సిటీ మేజిస్ట్రేట్ హల్ద్వానీ అనుమతితో ట్రాఫిక్ అనుమతి నైనిటాల్ రోడ్, బరేలీ రోడ్, రాంపూర్ రోడ్, కలదుంగి రోడ్, ముఖాని, దహ్రియా, ఉంచాపుల్ ప్రాంతాల్లో పోలీసుల దిగ్బంధనం మధ్య వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Read More: PV Narasimharao : పీవీ.. మన ఠీవీ.. ఆర్థిక సంస్కరణల పితామహునిగా గుర్తించిన చరిత్ర


“హల్ద్వానీలో పరిస్థితి సాధారణంగా ఉంది. కర్ఫ్యూ ఎత్తివేశాం. బంబుల్‌పురాలో కర్ఫ్యూ కొనసాగుతోంది. 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఐదుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.” అని రాష్ట్ర ADG లా అండ్ ఆర్డర్ AP అన్షుమాన్ తెలిపారు.

హల్ద్వానీలోని బంభుల్‌పురాలో శాంతిభద్రతల పరిరక్షణకు మేజిస్ట్రేట్‌ను నియమించారు. మొత్తం ప్రాంతాన్ని 5 సూపర్ జోన్‌లుగా విభజించారు. 7 మంది మేజిస్ట్రేట్‌లను మోహరించారు.

బంబుల్‌పురా హింస కేసులో పెట్రోల్ బాంబులు తయారు చేసిన 12 మంది యువకుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. వారు పెట్రోల్‌ బాంబులు తయారు చేసి దుండగులకు ఇస్తున్నట్లు హల్ద్వానీ పోలీసులకు సమాచారం అందింది. బైక్‌లోని పెట్రోల్‌ను తీసి దుండగులు పెట్రోల్‌ బాంబులు తయారు చేసినట్లు సమాచారం. బంబుల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన బైక్‌లో పెట్రోల్ పైపులను కోసి వాహనాలకు నిప్పు పెట్టారు.

Tags

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×