CM Revanth Reddy Tweet: మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారత రత్న రావడం స్వాగతిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పీవీ నర్సింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం ఇది అన్నారు.
Read More: పీవీ పొలిటికల్ జర్నీ.. లైఫ్ లో టర్నింగ్ పాయింటే ఇదే..!
మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కె అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరమైనదన్నారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎం. ఎస్ స్వామినాథన్ లకు నేడు కేంద్రం భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించిన విషయం తెలిసిందే.