Gokulpuri Metro Station in Delhi:ఢిల్లీ మెట్రో గోకుల్పురి స్టేషన్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. గోకుల్పురి మెట్రో పింక్లైన్ స్టేషన్లో ప్లాట్ఫారమ్ సైడ్ వాల్లో కొంత భాగం కూలిపోయి రోడ్డుపై పడింది.
ఉదయం సమయం కావడంతో మెట్రో స్టేషన్ దిగువన వెళ్లే రోడ్డుపై జనం రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ప్లాట్ పారమ్ సైడ్ వాల్ కూలిపోవడంతో భయాందోళనకు గురి అయ్యారు. శిథిలాలలో ఒకరు చిక్కుకోగా, 3 నుంచి 4 మందికి గాయాలైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఘటనా సమయంలో స్కూటర్పై వెళుతున్న వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నారు. కొందరి సహాయంతో పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను జీటీబీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను గుర్తించేందుకు చర్యలు చేపట్టి మరింత సమాచారం సేకరిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే జేసీబీ, క్రేన్ సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. అదే సమయంలో, ఈ ప్రమాదం తర్వాత, మెట్రో యొక్క కొత్త మార్గాలలో పింక్ రూట్ ఒకటి కాబట్టి నిర్మాణ పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.